ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు నుండి పిలుపు వచ్చింది .ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం .
గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ ,మంత్రి హరీష్ రావు నేతృత్వంలో త్వరలో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల వేడుకలపై సమీక్ష సమావేశం జరిగింది .ఈ సమీక్షా సమావేశం సందర్భంగా ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించాలి .పక్క రాష్ట్రమైన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకున్నది అని సమాచారం ..
