Home / ANDHRAPRADESH / పోలవరంపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్య..!

పోలవరంపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్య..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరదాయినిగా మారుతుందని అనుకుంటున్న పోలవరం ప్రాజెక్టుపై ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మిత్రపక్షాలైన బీజేపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం మరింతగా ముదిరింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం గుత్తేదారులను మార్చేందుకు అంగీకరించేది లేదని బీజేపీ తేల్చి చెప్పింది. అడ్డగోలుగా వ్యవహరిస్తూ కొత్త కాంట్రాక్టర్లను పిలిస్తే, అధికారులంతా జైలుకు వెళ్లాల్సి వస్తుందని బీజేపీ సీనియర్ నేత రఘునాథబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా ఎవరి పేరూ చెప్పకుండా, టీడీపీపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన, ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్రం సంకల్పంతో ఉన్నా, కావాలనే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒక టీవీ చానల్ నిర్వహించిన డిబేట్ లో పాల్గొన్న ఆయన, ప్రస్తుతానికి కాంట్రాక్టులను ఆపాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్రం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, టీడీపీ సర్కారు పలువురు అధికారులను పావులుగా మారుస్తోందని రఘునాథబాబు విమర్శించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat