ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన పాడేరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ఇటీవల టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్న సంగతి విదితమే .ఆమె పార్టీ మారి పట్టుమని పది రోజులు కాకుండానే ఆమె వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు ,ఆరోపణల వర్షం కురిపిస్తున్నారు .పార్టీ మారిన వెంటనే మాట్లాడుతూ జగన్ కోట్లు ఉన్నవారికే టికెట్లు ఇస్తారు అని విమర్శలు చేశారు .తాజాగా ఆమె మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాను ఆమె అన్నారు .అంతే కాదు ఏకంగా సాక్షి పత్రిక మీద కూడా ఆమె కేసు పెడతాను అని అన్నారు .
