బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ,ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు సంబంధించిన భద్రతను కేంద్ర సర్కారు తగ్గించింది .దీనిపై లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మాట్లాడుతూ తన తండ్రికి ఎమన్నా అయితే ప్రధాన మంత్రి నరేందర్ మోదీ తోలు తీస్తామంటూ హెచ్చరించారు .లాలూను చంపడానికి కుట్ర జరుగుతుంది .
మేము చూస్తూ ఊరుకోము .మోదీ తోలు తీస్తాం అని ఆయన వార్నింగ్ ఇచ్చాడు .ఈ వ్యాఖ్యలు ప్రతాప్ యాదవ్ ఏకంగా అసెంబ్లీ పరిసరాల్లోనే చేయడంతో అధికార పక్షం సభ్యులు నిరసన తెలిపారు. ఈ నెల 23న కొందరు రాజకీయ నాయకుల సెక్యూరిటీని తగ్గించింది కేంద్ర ప్రభుత్వం అందులో భాగంగా బీహార్ నుంచి లాలూతోపాటు బీహార్ మాజీ సీఎం జీతన్ రామ్ మాంఝీ, శరద్యాదవ్లకు భద్రతను కూడా తగ్గించేశారు. దీనిపై ఆర్జేడీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు.