తెలుగు రాష్ర్టాల్లో మహిళలపై అత్యంత దారుణంగా లైంగిక దాడులు జరుగుతున్నాయి. వావి వరుసలు మరచి కామంతో రెచ్చిపోతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో దారుణం జరిగింది. మామ లైంగిక వేధింపులు భరించలేక కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో మామ కత్తితో కడుపుపై కోసుకున్నాడు. కుంచం పోచయ్య అనే వ్యక్తి కోడలు కౌసల్యను కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. అతని వేధింపులు భరించలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి అరెస్టు చేస్తారనే భయంతో పోచయ్య కత్తితో కడుపుపై కోసుకున్నాడు. అతని పరిస్థితి ప్రమాదకరంగా ఉందన్న కామారెడ్డి డాక్టర్లు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోచయ్య భార్య అతని వేధింపులు భరించలేక వదిలిపెట్టి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కామారెడ్డి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
