పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ కీర్తి నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో ఏ సినిమాకి కూడా కీర్తి తనకు తాను వాయిస్ ఇచ్చుకోలేదు. కానీ తెలుగులో తొలిసారిగా కీర్తి సురేశ్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుందట. ఈ సంతోషాన్ని తన ట్విట్టర్ ఫాలోయర్లతో షేర్ చేసుకుంది.’తెలుగులో తొలిసారి డబ్బింగ్ చెప్పేశాను. నా వాయిస్ డబ్బింగ్ విజయవంతంగా పూర్తయింది. ఇప్పుడు పూర్తి నటిగా ఫీలవుతున్నానంటూ’ మూవీ స్టిల్ను చూపిస్తూ అందుకు సంబంధించిన ఓ ఫొటోను నటి కీర్తి ట్వీట్ చేసింది. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2018 జనవరి 10న రిలీజ్ కానుంది.
Dubbing for the first time in Telugu anndddd finished successfully! Now I feel complete!?
Title from tomorrow ?
#PSPK25 #TrivikramSrinivas @haarikahassine pic.twitter.com/wetwa00WSo
— Keerthy Suresh (@KeerthyOfficial) November 26, 2017