బాలీవుడ్ అందాల రాక్షసి ,ఒకప్పటి మిస్ వరల్డ్ స్టార్ నటి ఐశ్వర్యరాయ్ ఇటీవలే తమ కుమార్తె ఆరాధ్య పుట్టిన రోజును అత్యంత వేడుకగా నిర్వహించిన సంగతి తెల్సిందే . ఈ సందర్భంగా వారి స్వగృహం ‘ప్రతీక్ష’లో గ్రాండ్ పార్టీ కూడా నిర్వహించారు. ఈ వేడుకలో ఆరాధ్య ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన పింగ్ గౌన్ ధరించింది.అయితే ఈ గౌను చూసేందుకు సాధారణంగానే కనిపించినా, ఇది చాలా ఖరీదైనది అని టాక్ . ఆరాధ్య ధరించిన ఫ్లోరల్ ప్రింట్ కలిగిన మిలేనియల్ పింక్ బాల్రూమ్ గౌను ధర అక్షరాల సుమారు రూ. 60 వేలు. అంతే కాదు ఈ గౌనుతో పాటు ఆరాధ్య ధరించిన లెదర్ చియారా ఫ్రీ- వాకర్స్ షూస్ ధర రూ. 20 వేలు.
