కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పట్టాభిషేకానికి ముహూర్తం సిద్ధమైంది.పార్టీ పగ్గాలు రాహుల్కు అప్పగించేందుకు వడివడిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే నెల 8న రాహుల్ అధ్యక్ష పగ్గాలను స్వీకరిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గుజరాత్, హిమాచల్ప్రదేశ్ ఎన్నికల ఫలితాల కంటే ముందుగానే ఆయన పట్టాభిషేకం కార్యక్రమాన్ని పూర్తిచేయాలని సీడీబ్ల్యూసీ భావిస్తోంది. నేడు జరగనున్న సమావేశంలో ఇందుకు సంబంధించిన పార్టీ అంతర్గత ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ను ఖరారు చేయనున్నారు. నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ, పరిశీలన, ఓటింగ్ తదితర ప్రక్రియల తేదీలను నిర్ణయించనున్నారు. రాహుల్కు పోటీగా ఎవరైనా బరిలోకి దిగితే ఈ మొత్తం ప్రక్రియకు 14 రోజులు పడుతుంది. ఏకగ్రీవమైతే ఏ సమస్యా లేదు.
