శాసనసభలో రైతు సమన్వయ సమితులు, రైతులకు పెట్టుబడిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో గత వారం రోజులుగా ప్రయోగత్మాకంగా విద్యుత్ను 24 గంటలు సరఫరా చేస్తున్నామని సీఎం తెలిపారు. 24 గంటల విద్యుత్ సరఫరా అద్భుతమైన పెట్టుబడులను ఆకర్షిస్తుందన్నారు. కరెంట్ సరఫరాలో కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. రైతులందరికీ ఆటోస్టాటర్లు తీసేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు సీఎం. ఆటోస్టాటర్ల వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. వీటి వల్ల కలిగే నష్టాలపై రైతులకు ఎమ్మెల్యేలు, అధికారులు అవగాహన కల్పించాలన్నారు సీఎం. ఎండకాలంలో కూడా విద్యుత్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఎం పేర్కొన్నారు.
