ఏపీ శాసనసభ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. దేశంలోనే బలమైన ప్రతిపక్షం ఉన్న రాష్ట్రాలలో ఏపీ ముందువరుసలో ఉంటుంది. దానికి ప్రధాన కారంణం వైసీపీ. అయితే ఈ సారి అసెబ్లీ మొత్తం సందడి లేకుండా బోసిపోయినట్టు కనిపిస్తోంది. అయితే దానికి బలమైన కారాణాలే ఉన్నాయి.
అవును ఏపీ అసెంబ్లీ సమావేశాల్ని వైసీపీ బహిష్కరించింది. అసెబ్లీ సమావేశాలను వైసీపీ ఎందుకు బహిష్కరించిదో.. తుగు కారణాలు కూడా సభాపతి ముందు వివరణ ఇచ్చింది. వైసీపీ తరుపున గెలిచి.. పార్టీ మారిన 22 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేంత వరకూ తాము శాసనసభకు రాబోమని ప్రతిపక్ష వైసీపీ ఇప్పటికే స్పష్టం చేసింది.అంతేకాకుండా వైసీపీ టిక్కెట్ మీద గెలిచి మంత్రులుగా సభలో కూర్చున్నా స్పీకర్ చోద్యం చూస్తున్నారని ఎద్దేవా చేసింది. దీంతో ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ఈ సమావేశాలను బహిష్కరించిన నేపథ్యంలో ఖాళీ.. ఖాళీగా కనిపిస్తోంది.