వైద్యం చేయడంలో విసుగు చెందిన ఓ జర్మనీ నర్సు ఏకంగా 106 మంది రోగులను పొట్టనబెట్టుకుంది. ప్రాణంతక మందులను ఇచ్చి వీరిని చంపినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. డెల్మెన్హోస్ట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే నీల్స్ హోగెల్(41) 2015లో ఓ ఇద్దరి రోగులను హత్య చేసినట్లు, మరో ఇద్దరిపై హత్యాయత్నం జరిపిందన్న కేసులో అరెస్ట్ అయింది. అయితే ఈమె మరిన్ని హత్యలకు పాల్పిడిందని ఆరోపణలు రావడంతో దర్యాప్తు జరిపిన పోలీసులకు విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. ఆమె మెత్తం 90 మంది రోగులను హతమార్చినట్లు పోలీసులు అదే ఏడాది ఆగష్టులో ప్రకటించారు. దీంతో జర్మనీ కోర్టు ఆమెకు జీవిత కాల జైలు శిక్ష విధించింది.
ఈ కేసు బాధితులు మరింతమంది పోలీసులను ఆశ్రయించడంతో మరోసారి దర్యాప్తు జరిపిన పోలీసులు తాజాగా మరో 16 మందిని కూడా నీల్స్ హోగెల్ చంపినట్లు గురువారం వెల్లడించారు. ఈ హత్యలను 1999-2005లో నీల్స్ పనిచేసిన రెండు ఆసుపత్రిలో జరిపినట్లు తెలిపారు. ఎవరికి అనుమానం రాకుండా రోగులకు ప్రాణంతక మందులు ఇంజెక్ట్ చేసి చంపేది. 2005లోనే ఓ రోగికి ప్రాణంతక మందులను ఇంజెక్ట్ చేస్తుండగా గుర్తించిన మరో నర్సు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పుడే నీల్స్ను అరెస్టు చేయగా.. ఆమెకు కోర్టు ఏడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. ఇవన్నీ వైద్యం చేయడంలో విసుగు చెందే చంపినట్లు నిందితురాలు అంగీకరించందని పోలీసులు పేర్కొన్నారు.