Home / ANDHRAPRADESH / మూడో రోజు జగన్ పాదయాత్రలో ఎంత దూరం నడిచారు ..ఏమి చేశారంటే ..?

మూడో రోజు జగన్ పాదయాత్రలో ఎంత దూరం నడిచారు ..ఏమి చేశారంటే ..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్రలో భాగంగా మూడోరోజు ప్రజాసంకల్పయాత్ర ఈ రోజు మొత్తం 16.2 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఆయన రాత్రి ఉరుటూరులో ఏర్పాటు చేసిన శిబిరం వద్ద యాత్రను ముగించారు. జగన్‌ మూడో రోజు ‘ప్రజాసంకల్పయాత్ర’ను నేలతిమ్మాయిపల్లి నుంచి ఉదయం 8.40 గంటలకు ప్రారంభించారు. నేలతిమ్మాయిపల్లిలో పార్టీ జెండాను జగన్‌ ఆవిష్కరించారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు.

ఆ తర్వాత మార్గమధ్యలో రామిరెడ్డిపల్లె గ్రామస్థులు ఆయనను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి జగన్‌ హామీయిచ్చారు. అక్కడి నుంచి పాలగిరి జంక్షన్‌కు చేరుకున్నారు. తర్వాత వీఎన్‌ పల్లికి వచ్చారు. అనంతరం వీఎన్‌పల్లి సంగమేశ్వరాలయం జంక్షన్‌లో భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. పాదయాత్రలో భాగంగా ఆయనను వివిధ వర్గాల ప్రజలు కలిసి తమ సమస్యలను విన్నవిస్తున్నారు.

బ్రాహ్మణసంఘం నేతలు జగన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. భోజన విరామం అనంతరం మరలా యాత్రను ప్రారంభించారు.పాదయాత్రలో భాగంగా గంగిరెడ్డిపల్లి చేరుకున్న జగన్‌ వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేశారు. ఈ కార్యక్రమంలో గంగిరెడ్డిపల్లి గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు. అంతకుముందు అదే గ్రామంలోని సాయిబాబా మందిరాన్ని జగన్ దర్శించుకుని, ఆశీర్వాదం తీసుకున్నారు. అయ్యవారిపల్లి మీదగా ఉరుటూరు చేరుకున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat