ప్రధానమంత్రి నరేందర్ మోదీ సొంత నియోజకవర్గం అయిన వారణాసిలో బీజేపీ పార్టీకి ఎవరు ఊహించని షాక్ తలిగింది .ఈ క్రమంలో నియోజక వర్గంలో ఒక ప్రముఖ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్ష ఎన్నికల్లో బీజేపీ అనుబంధ విభాగం ఏబీవీపీ ఘోర పరాజయం చవిచూసింది. అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్ధిపై స్వతంత్రంగా పోటి చేసిన అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలవడం విశేషం .
అసలు విషయానికి వస్తే స్థానికంగా మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్ యూనివర్సిటీ ఎన్నికలను విద్యార్థి సంఘాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటాయి. అందులో భాగంగా ఈ సారి జరిగిన ఎన్నికల్లో ఏబీపీవీ తరపున వాల్మీకి ఉపాధ్యాయ బరిలోకి దిగగా, సమాజ్వాదీ ఛాత్ర సభ నుంచి రాహుల్ దుబే పోటీ చేయాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో రాహుల్కి టికెట్ ఇవ్వకపోవటంతో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేశాడు.
మొత్తం పోలైన ఓట్లలో 2,365 ఓట్లు రాహుల్కి దక్కగా, వాల్మీకికి 1,393 ఓట్లు దక్కాయి. దీంతో వెయ్యికి పైగా ఓట్లతో రాహుల్ ఘన విజయం సాధించినట్లయ్యింది. ఉపాధ్యక్ష పదవి, లైబ్రేరీ సెక్రటరీ పదవులను గతేడాది అభ్యర్థులకే మద్దతు ఇచ్చి ఎస్సీఎస్(సమాజ్వాదీ పార్టీ విభాగం), ఎన్ఎస్యూఐ(కాంగ్రెస్ పార్టీ విభాగం) నిలుపుకోగా, ఉన్న ఒక్క పదవిని ఏబీవీపీ కోల్పోయినట్లయ్యింది. అయితే గత కొంతకాలంగా జరిగిన పలు యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ వరుస పరాజయాలను చవిచూడటం గమనార్హం.