ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చోరీ జరిగింది. సోమవారం జూబ్లీహిల్స్లోని చిరంజీవి ఇంట్లో పనిచేసే వ్యక్తి రూ.2లక్షల నగదుతో పరారైనట్లు సమాచారం. చోరీకి సంబంధించి చిరంజీవి మేనేజర్ గంగాధర్ ఈ విషయంపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిరు ఇంట్లో సర్వర్గా పనిచేసే చెన్నయ్య అనే వ్యక్తి డబ్బుతో ఉడాయించినట్లు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిరంజీవి మేనేజర్ ఫిర్యాదుతో చెన్నయ్యపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
