త్వరలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకోనున్న ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర పర్యటన ఖరారైంది.అందులో భాగంగా ఈనెల 20వతేదీన రాష్ట్రంలో వరంగల్లో జరిగే సభలో రాహూల్ గాంధీ పాల్గొననున్నారు అని ఆ పార్టీ వర్గాలు ఒక ప్రకటనను విడుదల చేశారు .
రాహుల్ పర్యటనలో భాగంగా ఆ రోజు సాయంత్రం 6గంటలకు భారీ బహిరంగ సభ జరగనుంది. రాహుల్ వరంగల్ పర్యటనకు సంబంధిచిన పర్యటన వివరాలను రాహుల్ కార్యాలయ వర్గాలు ఖరారు చేసి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పంపింది.
అయితే ఈనెలలో తెలంగాణలో ఓ భారీ బహిరంగ సభను నిర్వహించి ఆ సభకు రాహూల్ను రప్పించాలని టీ పీసీసీ గత నెలలోనే తలపెట్టింది. అంతేగాక ఇటీవల రేవంత్రెడ్డితోపాటు పలువురు టీడీపీ నేతలు పెద్దఎత్తున
కాంగ్రెస్లో చేరారు.