Home / NATIONAL / రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త…

రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త…

దేశంలోని రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త. ఈ రైళ్లు.. ప్రయాణ సమయం కన్నా గంటకుపైగా ఆలస్యంగా నడిస్తే, ప్రయాణికులకు ఆ సమాచారం సంక్షిప్త సందేశం రూపంలో వారి మొబైల్‌ ఫోన్లకు వస్తుంది. ప్రస్తుతం నిరీక్షణ జాబితాలో ఉన్న వారికి బెర్త్‌ ఖరారైతే ఎస్‌ఎంఎస్‌ వస్తోంది.

అయితే నేటి నుంచి రాజధాని, శతాబ్ది రైళ్లలో ప్రయాణించేవారికి ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన సీనియర్‌ అధికారి వెల్లడించారు. దశల వారీగా ఇతర రైళ్లకు ఈ ఎస్‌ఎంఎస్‌ సౌకర్యాన్ని విస్తరిస్తామని అన్నారు.

రైలు ఆలస్యానికి సంబంధించిన సమాచారాన్ని అందించే ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేయడం ముఖ్యమని రైల్వేశాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌(సీఆర్‌ఐఎస్‌) భావించింది. దీంతో ఈ సౌకర్యాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat