ఏపీలోని లక్షలాది మంది పేద, మధ్యతరగతి ప్రజానీకాన్ని ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన పూర్తి భరోసా కల్పించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు , ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధమయ్యారు. ఈ నేపధ్యంలో ఈనెల 6 నుంచి ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సుల కోసం ఇవాళ రాత్రి తిరుమల వెళ్లనున్నారు . శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకుంటారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నా యకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం దర్శనం పూర్తయ్యాక తిరిగి హైదరాబా ద్ బయలుదేరతారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు నారాయణస్వామి వివరిం చారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత తిరుమల పర్యటనను, 6న చేపట్టే పాదయాత్రను విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.