వెండితెర అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి సిల్వర్ స్కీన్ ఎంట్రీ కోసం జరుగుతున్న హడావుడి అంతా ఇంతా కాదు. ప్రస్తుతం బాలీవుడ్ మాత్రమే కాకుండా టాలీవుడ్ కూడా ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్న ఏకైక విషయం జాన్వి కపూర్ వెండితెర తెరంగేట్రం ఎప్పుడు చేస్తోందని. తొలుత తెలుగులో రామ్ చరణ్ సరసన అని, ఆ తర్వాత అఖిల్కి జోడీగా అని వార్తలు వచ్చాయి.
బాలీవుడ్ మీడియాకి శ్రీదేవి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో నా కూతురు ఓ బాలీవుడ్ సినిమా ద్వారా డెబ్యూ చేస్తోంని అని చెప్పేయడంతో తెలుగులో పరిచయమయ్యే అవకాశం లేదనే విషయం తేటతెల్లమైపోయింది. రీసెంట్ గా బాలీవుడ్ లోనూ జాన్వి కపూర్ ఎంట్రీ కోసం పలు సినిమాల రీమేక్స్ ను, సీక్వెల్స్ ను పరిగణలోకి తీసుకొన్నారు.
కరణ్ జోహార్ స్టూడెంట్ నెం వన్ సీక్వెల్ చిత్రంలో జాన్వి కపూర్ను ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు. అయితే అప్పుడు శ్రీదేవి ఒప్పుకపోవడంతో ఆమె స్థానంలో సైఫ్ కూతుర్ని తీసుకొన్నారు. ఆ తర్వాత మరాఠీ సూపర్ హిట్ చిత్రం సైరత్ హిందీ రీమేక్లో జాన్వీ ఎంట్రీ ఫిక్స్ అని అందరూ ఫిక్స్ అయిపోయిన తరుణంలో ఇప్పుడు ఆ సినిమాతో కూడా కాదంట.. శ్రీదేవితో కలిసి మిస్టర్ ఇండియా 2 తోనే జాన్వీ కపూర్ ఆన్ స్క్రీన్ డెబ్యూ అని టాక్ వినిపిస్తోంది. బోణీకపూర్ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ కు వెళ్లనుందట.