విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్న 600 అసిస్టెంట్ ఇంజనీర్(AE) పోస్టులను భర్తీ చేయాలని డిస్కమ్లు నిర్ణయించాయి. తెలంగాణ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్(టీఎస్ట్రాన్స్కో), దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్)ల్లో ఈ మేరకు పోస్టుల భర్తీకి కసరత్తు జరుగుతోంది. ఈ నియామకాలన్నిటికీ ఉమ్మడిగా ఒకే నోటిఫికేషన్ జారీ కానుంది. విద్యుత్ సంస్థల వారీగా ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఐటీ విభాగాల్లో AE పోస్టుల ఖాళీలను గుర్తించి భర్తీ చేసేందుకు కసరత్తును ముమ్మరం చేశారు. రెండేళ్ల కిందట జారీ చేసిన 1427 ఏఈ పోస్టుల నియామక ప్రక్రియ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇటీవలే పూర్తైంది. వాటిలో భర్తీకాకుండా మిగిలిపోయిన పోస్టులతో పాటు ఖాళీగా ఉన్నవి కలుపుకొని 600 ఏఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
