భార్య తనతో శృంగారానికి అంగీకరించలేదని ఓ ప్రబుద్ధుడు ఆమె జననాంగాలపై యాసిడ్ పోశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని కన్నౌజా ప్రాంతంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ అభాగ్యురాలు హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శృంగారాన్ని వ్యతిరేకించినందు వల్ల భార్యపై భర్త యాసిడ్ దాడిచేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కొత్వాలి జిల్లా బెహ్రిన్ గ్రామానికి చెందిన ఆ మహిళకు ఆరేళ్ల కిందట వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
తనతో శృంగారంలో పాల్గోవాలని అతడు బలవంతం చేస్తే అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఆగ్రహించాడు. దీంతో ఆమె మర్మాంగాలపై యాసిడ్ పోసి పరారయ్యాడు. యాసిడ్ దాడితో తీవ్రంగా గాయపడిన బాధితురాలు కేకలు విని ఇరుగుపొరుగు వారు అక్కడ చేరుకుని ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆమెను హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై బాధితురాలు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్తతోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.