లక్షా 12 వేల ఉద్యోగాలు 100 శాతం తప్పకుండా భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ శాసన సభలో అంబేద్కర్ ఓవర్సీస్ పథకం, గ్రూప్-2 ప్రశ్నలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. అంబేద్కర్ ఓవర్సీస్ పథకానికి పరిమితి లేదన్నారు. అర్హులందరికీ ఈ పథకం వర్తింపచేస్తామని సీఎం హామీ ఇచ్చారు. బలహీన వర్గాల కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని సీఎం ఈ సందర్భంగా తెలియజేశారు. ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా భర్తీ ఉంటుందన్నారు. టీఎస్పీఎస్సీలో అనేక సంస్కరణలు చేపట్టిన ఘంటా చక్రపాణిని యూపీఎస్సీ అభినందించిందని సీఎం గుర్తు చేశారు. నిర్మాణాత్మక సలహాలిస్తే స్వీకరిస్తం కాని.. అడ్డగోలుగా మాట్లాడితే గౌరవం ఉండదని సీఎం హెచ్చరించారు. చెప్పిన దానికంటే వెయ్యి ఉద్యోగాలు ఎక్కువగానే ఇస్తామని అన్నారు. ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగానే భర్తీ ఉంటుందని సీఎం అన్నారు.
