Home / NATIONAL / సుప్రీం కోర్టు టీవీ ఛానళ్లకు కీలక సూచన…!

సుప్రీం కోర్టు టీవీ ఛానళ్లకు కీలక సూచన…!

చిన్నారుల ప్రాణాలను బలిగొంటున్న ‘బ్లూవేల్‌’ ఆన్‌లైన్‌ గేమ్‌ను జాతీయ సమస్యగా సుప్రీం కోర్టు అభివర్ణించింది. ఈ ప్రమాదకర గేమ్‌ అరికట్టేందుకు మూడు వారాల్లోగా ప్రణాళికను సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చిన్నారులు ఈ గేమ్‌ ఆడకుండా అవగాహన కల్పించేలా ఒక కార్యక్రమాన్ని రూపొందించాలని దూరదర్శన్‌కు సూచించింది. రోజులో ప్రధాన సమయాన్ని (ప్రైమ్‌టైమ్‌) ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసేందుకు డీడీ సహా ఇతర ఛానళ్లు కేటాయించాలని పేర్కొంది.
ఇప్పటికే ‘బ్లూవేల్‌’ సమస్య గురించి నిపుణుల బృందం పరిశీలన జరుపుతోందని కేంద్రం సుప్రీం కోర్టుకు వివరించింది. ఈ సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేసింది.
రష్యాలో పుట్టిన ఈ గేమ్‌ ఇప్పటికే పలువురు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. గత కొన్ని నెలల వ్యవధిలో భారత్‌లో ఆరుగురు చిన్నారులు ఈ గేమ్‌ బారిన పడి ప్రాణాలు తీసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 100 మంది మరణించారు. చిన్నారుల మరణాలపై స్పందించిన కేంద్రం ఇప్పటికే ఇంటర్నెట్‌ దిగ్గజాలైన ఫేస్‌బుక్‌, గూగుల్‌ వంటి సంస్థలకు ఈ లింకులను తొలగించాలని సూచించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు, పాఠశాలలు సైతం ‘బ్లూవేల్‌’ బారిన పడకుండా చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat