రైతు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు తలపెట్టిన ఛలో అసెంబ్లీని తెలంగాణ పోలీసులు శుక్రవారం భగ్నం చేశారు. పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు.చలో అసెంబ్లీకి అనుమతి లేదని నాయకులను, కార్యకర్తలను అడ్డుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు మొదలైన రోజే ఈ ఆందోళన చేపట్టడంతో ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే దానికి కాంగ్రెసే బాధ్యత వహించాలని హెచ్చరించింది.హైదరాబాదు నగర శివారుల్లో పెద్ద సంఖ్యలో చెక్ పోస్టులను పోలీసులు ఏర్పాటు చేశారు. గాంధీభవన్ నుంచి బయల్దేరిన పొన్నం ప్రభాకర్, గండ్ర తదితరులను అరెస్ట్ చేశారు. జిల్లాల్లోనూ అరెస్ట్ పర్వాలు సాగాయి. కొందరిని గృహనిర్బంధం చేశారు. ఉత్తమ్ కుమార్, డీకే సబితా, సునీతా లక్ష్మారెడ్డిలను కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
