భూకబ్జాను అడ్డుకున్న ఇద్దరు మహిళలపై దాడి చేసి, వాళ్ల చేతులు, కాళ్లు కట్టేసి పొదల్లో పడేసారు. ఇంత దారుణమైన ఘటన ఏపీలోని విశాఖ జిల్లాలో జరిగింది. అనకాపల్లికి చెందిన శేఖర్ ..భూపతిపాలెం గ్రామానికి చెందిన దేవుడు అనే రైతు చెందిన భూమిని కబ్జా చేయాలనుకున్నాడు. దీనిని అడ్డుకున్నందుకు, దేవుడు కూతుర్లపై దాడి చేసి చేతులు, కాళ్లు కట్టేసి చెట్లల్లో పడేసారు. అధికారంలో ఉన్న ‘లోకల్ లీడర్ల అండ దండలతో మాభూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని’ దేవుడి కూతుర్లు ఆరోపిస్తున్నారు. తండ్రి చనిపోయిన తర్వాత బంజర భూమిని సాగు చేసుకుంటున్నామని, రికార్డుల్లో తమ పేర్ల నమోదు చేయాలని దేవుడు బిడ్డలు కళా వెంకటలక్ష్మి, ఆదిలక్ష్మి, మహలక్ష్మి అధికారులను డిమాండ్ చేశారు. కానీ అది ప్రభుత్వ భూమి అని దానిపై ఇరు వర్గాలు, మాదంటే మాదని కొట్లాడుతున్నారని అధికారులు స్పష్టం చేశారు. అయితే పోలీసులు మహిళలపై అమానుషమైన ఈ దాడులను మాత్రం సహించబోమని , దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏది ఏమైనా ఏపీలో మహిళలకు నిజంగానే రక్షణ లేకుండా పోయింది. రోజు రాష్ట్రంలో ఎక్కడో ఒక్క చోట ఆడవారిపై అత్యంతా దారుణంగా లైంగిక దాడులు, హత్యలు జరుగతూనే ఉన్నాయి.
