Home / SLIDER / భూములు కోల్పోయినవారికి ఇంటికో ఉద్యోగం..మంత్రి కేటీఆర్

భూములు కోల్పోయినవారికి ఇంటికో ఉద్యోగం..మంత్రి కేటీఆర్

భూములు కోల్పోయిన వారి కుటుంబాల్లో.. ఇంటికి ఒకరికి టెక్స్‌టైల్ పార్కులో ఉద్యోగం కల్పించి … వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని మంత్రి కేటీఆర్  భరోసానిచ్చారు.  కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్క్‌కు శంకుస్థాపనం సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.మన వరంగల్ జిల్లా నుంచి వలసపోయిన నేతన్నలతో సీఎం కేసీఆర్ సమావేశమై ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. 1200 ఎకరాల భూమి కోల్పోతున్నప్పటికీ.. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చినందుకు వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నానని తెలిపారు. మొదటి రోజునే ఈ పార్క్‌లో 14 సంస్థలు.. 3,900 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి వచ్చాయని చెప్పారు. ప్రస్తుత ఒప్పందాలతోనే 25 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతుందన్నారు. తెల్ల బంగారాన్ని పండించే రైతులు తెలంగాణలో కోకోల్లలుగా ఉన్నారు. ఈ పత్తిని నూలుగా వడికే అపారమైన నేతన్నలు తెలంగాణలో ఉన్నారని తెలిపారు. భారతదేశంలోనే అతిపెద్దదైన టెక్స్‌టైల్ పార్క్‌కు శంకుస్థాపన జరగడం శుభసూచకమని మంత్రి కేటీఆర్ తెలిపారు.అంతర్జాతీయ ప్రమాణాలతో.. కాలుష్యం లేకుండా పార్క్‌ను ఏర్పాటు చేసుకోబోతున్నాం. సంవత్సరం లోపే పార్క్ ప్రారంభం చేస్తామన్నారు కేటీఆర్.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat