త్రివిక్రమ్ దర్శకత్వంలోజూనియర్ ఎన్టీఆర్ గా హీరో ఓ కొత్త చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం పూజా కార్యక్రమం రేపు జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ అగ్రహీరో పవన్ కల్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ సినిమాకు తొలి క్లాప్ కూడా పవనే కొట్టనున్నారు. కాగా, ఈ చిత్రాన్ని హారికా & హాసిని క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న తెరకెక్కించనుంది. 2018 జనవరి నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరగనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా, త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతోంది. పవన్ సరసన అనూ ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేశ్ నటించనున్న ఈ చిత్రానికి ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ సినీ కెర్ లో ఇది 28వ చిత్రం.