తమిళ హీరో ఇళయదళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా మెర్శల్. రాజా-రాణి ఫేం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా విడుదల అయిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకోగా వివాదాలు విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే బెంగళూరులోని ఈ సినిమా థియేటర్లపై దాడులు జరిగాయని సమాచంర. గురువారం తెలుగులో విడుదలకావాల్సి ఉన్నా.. కొన్ని వివాదాల కారణంగా రిలీజ్ కాలేదు. తమిళనాడు అంతటా విడుదలై.. భారీ వసూళ్లు రాబడుతున్న ఈ సినిమాను వివాదాలు కూడా బాగానే చుట్టుముడుతున్నాయి.
అసలు విషయం ఏంటంటే మెర్సల్ చిత్రంలో విజయ్ పలు రాజకీయ డైలాగ్లు పేల్చడంతో దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యంగా వస్తుసేవల పన్ను (జీఎస్టీ), డిజిటల్ చెల్లింపుల పై విజయ్ పేల్చిన డైలాగులు.. డైరెక్ట్గా మోదీ టీంకు తగిలాయని.. దీంతో ఆ డైలాగ్లు బీజేపీని అసంతృప్తికి గురిచేశాయని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా నుంచి ఈ డైలాగులు వెంటనే తొలగించాలని తమిళనాడు బీజేపీ అధ్యక్షులు తమిళిసాయి సౌందర్రాజన్ డిమాండ్ చేశారు. విజయ్ రాజకీయ లక్ష్యాలు ఉండటంతోనే ఆయన సినిమాలో ఈ డైలాగులు పేల్చారని విమర్శించారు. మెర్సల్ సినిమాలోని పలు డైలాగులు అభ్యంతరకరంగా ఉన్నాయి. జీఎస్టీ, డిజిటల్ ఇండియాను కించపరిచేలా ఉన్న డైలాగులను వెంటనే సినిమా నుంచి తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు.