సూపర్స్టార్ మహేశ్ బాబుని తెరపై చూడ్డం ఒక ఎత్తైతే.. తన కుటుంబంతో కలిపి చూడ్డం మరో ఎత్తు. ఇక మహేశ్ పక్కన కుమారుడు గౌతమ్ ఉంటే కళ్లప్పగించి చూస్తుంటారు అభిమానులు. అలాగే వాళ్ళిద్దరి పక్కన అల్లరి సితార వస్తే ఆ కిక్కే వేరు.. అంతే కాకుండా ఆ ముగ్గురుతో నమ్రత కూడా తోడైతే.. మహేష్ అభిమానుల్లో వచ్చే మజానే వేరు.. ఇక పైనున్న ఫొటో గురించైతే చెప్పనక్కర్లేదు. మహేశ్ ఓ కార్యక్రమంలో వినయంగా నిలబడితే.. సరిగ్గా అలాగే గౌతమ్, సితార, నమ్రత శిరోద్కర్లు నిలబడిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిని నమ్రత ట్విటర్లో షేర్ చేశారు. ఈ ఫొటోకి కామెంట్ పెడుతూ మాటల్లేవ్ అని ట్వీట్ చేశారు.
