హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి ఎల్లమ్మబండ మార్గంలో ఈ ఉదయం ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. ఉషాముళ్లపూడి కమాన్ వద్ద నుంచి ఎల్లమ్మబండకు వెళ్లే మార్గంలో తెలంగాణ కూడలి వద్ద రోడ్డు కుంగి భారీ గొయ్యి ఏర్పడింది. నీటి పైప్లైన్ పగిలి గొయ్యి నుంచి భారీగా నీరు ఉబికివస్తోంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ఆ మార్గంలో వెళ్లేవారిని అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ అధికారులు మరమ్మతు పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
