Home / ANDHRAPRADESH / వైఎస్సార్ శిష్యుడు.. వైసీపీ సీనియ‌ర్ నేత క‌న్నుమూత‌..!

వైఎస్సార్ శిష్యుడు.. వైసీపీ సీనియ‌ర్ నేత క‌న్నుమూత‌..!

వైసీపీ సీనియర్‌ నేత, వైఎస్సార్‌ జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గ ఇన్‌చార్జి కొల్లం బ్రహ్మానందరెడ్డి అనారోగ్యంతో శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. చెన్నైలో చికిత్స చేయించుకుని ఇటీవలే తిరుపతిలోని ఆయన స్వగృహానికి వచ్చారు. అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు. పుల్లంపేట మండలంలో రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన బ్రహ్మానందరెడ్డి.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి శిష్యుడిగా ఆయనతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. రైల్వేకోడూరులో వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచారు. బ్రహ్మానందరెడ్డి డీసీసీబీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. ప్రస్తుతం రైల్వేకోడూరు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి పార్టీ కార్యకర్తలకు, బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉంటూ ప్రజల్లో చెరగని ముద్ర వేశారు. ఇక కొల్లం బ్రహ్మానందరెడ్డి మృతి పట్ల వైసీపీ అధినేత స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. బ్రహ్మానందరెడ్డి పార్టీకి ఎంతో సేవ చేశారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ మంచి నాయకుడిని కోల్పోయిందని చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat