భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీని.. మహిళా క్రికెటర్లు హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన కలిశారు. గురువారం బెంగళూరులో భారత్-ఆసీస్ మధ్య నాలుగో వన్డే జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు హర్మన్, స్మృతి వచ్చారు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం వారు కోహ్లీని కలిసి కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంది.
ఇంగ్లాండ్, వేల్స్లో జరిగిన ప్రపంచకప్లో హర్మన్ప్రీత్, స్మృతి మంధాన కీలక ఇన్నింగ్స్లను అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా భారత్-ఆసీస్ల మధ్య చివరి వన్డే అక్టోబరు 1న నాగ్పూర్లో జరగనుంది.