విజయదశమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. లోక కంటకులు, దుష్టశక్తుల మీద.. దైవ శక్తుల స్ఫూర్తిదాయక విజయమే దసరా పండుగ ప్రతీక అని జగన్ అన్నారు..కుటుంబంలో ప్రతి ఒక్కరు సుఖశాంతులు, సంతోషాలతో తులతూగేలా జగన్మాత దీవెనలు లభించాలని జగన్ ఆకాంక్షించారు. తెలుగు ప్రజలంతా ఆనందోత్సవాల మధ్య దసరా పండుగను జరుపుకోవాలని వైఎస్ జగన్ సందేశం ఇచ్చారు.
