ఏపీలో మరో దారుణం జరిగింది. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఓ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను కొందరు యువకులు సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై యువతి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేశారు. కనిగిరి నగర పంచాయతీలోని శివానగర్ కాలనీ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ముగ్గురు విద్యార్థులు, ఇద్దరు విద్యార్థినులు కలిసి విహారానికి ఓ నిర్జన ప్రదేశానికి వెళ్లారు. అక్కడ ముగ్గురు విద్యార్థులు కలిసి అందులోని ఓ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించారు. యువతిని వివస్త్రను చేసేందుకు ప్రయత్నించిన దృశ్యాల్ని సెల్ఫోన్లో వీడియో తీసి ఆ దృశ్యాలను వాట్సాప్లో వారి స్నేహితులతో పంచుకున్నారు. ఈ ఘటనపై కనిగిరి పోలీస్ స్టేషన్లో యువతి ఫిర్యాదు చేసింది. ఎస్సై శ్రీనివాసరావు ముగ్గురు విద్యార్థులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. విద్యార్థుల్లో ఒకరు బీటెక్ చదువుతుండగా.. మరో ఇద్దరు డిగ్రీ చదువుతున్నారు. ఇద్దరు యువతుల్లో ఒకరు తప్పించుకోగా.. మరో యువతి తప్పించుకునేందుకు అవకాశం లేక విద్యార్థుల చేతిలో అత్యాచారయత్నానికి గురైంది.
