తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ డిల్లీ పర్యటనకు వెళ్లారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీతో మధ్యాహ్నం 1 గంటకు భేటీ కానున్నారు.బయ్యారం స్టీల్ ప్లాంట్,ఐటీఐ ఆర్ ,విభజన హామీలతో పాటు కొన్ని ముఖ్యమైన అంశాలను మంత్రి కేటీఆర్ ప్రధాని దృష్టికి తీసుకెళ్ళే అవకాశం ఉంది.ఈ మేరకు మంత్రి కేటీఆర్ ఈ విషయాన్నీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.