Home / TELANGANA / స‌రోజ‌నీ కంటి ద‌వాఖానాకు కొత్త హంగులు

స‌రోజ‌నీ కంటి ద‌వాఖానాకు కొత్త హంగులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద‌రాబాద్‌ మహానగరంలోని ప్ర‌ఖ్యాత స‌రోజ‌నీ కంటి ద‌వాఖానాకు కొత్త హంగులు స‌మ‌కూరుతున్నాయి. కోటి రూపాయల విలువైన అత్యాధునిక ప‌రిక‌రాల‌తో కూడిన కొత్త ఐ బ్యాంకు ఏర్పాటైంది. ఎసీ పోస్టు ఆప‌రేటివ్ వార్డు స‌మ‌కూరింది. నేత్రాల సేక‌ర‌ణ కోసం ఒక అంబులెన్స్ రెడీగా ఉంది. వీట‌న్నింటినీ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ ల‌క్ష్మారెడ్డి రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభించ‌నున్నారు.

see also:మంత్రి కేటీఆర్ గొప్ప మ‌న‌సుకు ఫిదా అయిన ఉత్త‌మ్‌

కంటి వైద్యం, శ‌స్త్ర చికిత్స‌ల‌కు సంబంధించి పెట్టింది పేరైన ప్ర‌భుత్వ స‌రోజ‌నీ కంటి ద‌వాఖానాకు మ‌హ‌ర్ద‌శ వ‌చ్చింది. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ ల‌క్ష్మారెడ్డి చొర‌వ‌తో రూ. కోటి విలువైన అత్యాధునిక ప‌రిక‌రాలు స‌మ‌కూరాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న క‌లెక్ష‌న్ సెంట‌ర్‌ని ఐ బ్యాంకుగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే మొద‌టి సారిగా పోస్టు ఆప‌రేటివ్ వార్డుని 20 ప‌డ‌క‌ల‌తో సెంట్ర‌లైజ్డ్ ఎసితో ఏర్పాటు చేస్తున్నారు.

Image may contain: screen and indoor

ఈ కార్యక్రమానికి హైద‌ర‌బాద్ న‌గ‌రానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, ఉన్న‌తాధికారులు పాల్గొంటార‌ని సరోజ‌నీ కంటి వైద్య‌శాల సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ ర‌వింద‌ర్‌గౌడ్ తెలిపారు.

see also;నాలాల‌పై అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను వెంట‌నే తొలగించండి..మంత్రి కేటీఆర్ ఆదేశం

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat