Home / ANDHRAPRADESH / వైఎస్‌ జగన్‌తో రమణ దీక్షితులు భేటీ..ఎందుకంటే..?

వైఎస్‌ జగన్‌తో రమణ దీక్షితులు భేటీ..ఎందుకంటే..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టీటీడీ ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కలిశారు.టిటిడిలో అవినీతి, అక్రమాలు, ఆగమ శాస్త్ర ఉల్లంఘనలు జరుగుతున్నాయని రమణ దీక్షితులు కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జగన్‌తో ఆయన భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.

ఈ సందర్భంగా అయన తనకు జరిగిన అన్యాయాన్ని జగన్‌ దృష్టికి తీసుకు వచ్చారు. వారసత్వంగా వచ్చిన అర్చకత్వ విధుల నుంచి తమను కావాలనే టీడీపీ ప్రభుత్వం తొలగించారంటూ రమణ దీక్షితులు చెప్పిన విషయాలపైజగన్‌ సానుకూలంగా స్పందించారు. రమణ దీక్షితులకు న్యాయం చేస్తామని జగన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.కాగా నిక్షేపాల కోసం తిరుమల శ్రీవారి పోటులో కొందరు తవ్వకాలు జరిపారని రమణ దీక్షితులు తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే . తవ్వకాలు జరిగాయనడంలో ఎలాంటి సందేహం లేదని.. ఆ వంట గదిలో జరిగిన మార్పులే ఇందుకు సాక్ష్యమని ఆయన అన్నారు. గతేడాది డిసెంబర్‌ 8న రహస్యంగా ఈ తవ్వకాలు జరిగాయని ఓ జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమణ దీక్షితులు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat