ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో సారి వైఎస్ జగన్పై ప్రశంసల వర్షం కురిపించారు. కాగా, ఇటీవల చలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పాదయాత్ర, ప్రత్యేక హోదా ఉద్యమం గురించి మాట్లాడారు. నాడు విభజన సమయంలో చంద్రబాబు రెండు నాల్కుల ధోరణి అవలంభిస్తున్న తరుణంలో, వైఎస్ జగన్ మాత్రం ఏపీకి దక్కాల్సిన ఫలాల గురించి వెలుగెత్తి చాటారన్నారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం వైఎస్ జగన్పై కుట్రపూరితంగానే కేసులు పెట్టిందని, అసలు వైఎస్ జగన్ నేరస్థుడు కాదన్నారు. కేంద్ర, రాష్ట్ర కేసులన్నీ కుట్రపూరితమైనవేనన్నారు.
see also : హ్యాట్సాఫ్ రోజా ..!! చలసాని శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు
see also : ఓటుకు నోటు కేసులో బాబు నిర్దోషి ..మంత్రి చంద్రమోహన్ రెడ్డి..
గత నాలుగేళ్ల నుంచి ప్రత్యేక హోదా అంశం బతికుండడానికి కారణం వైఎస్ జగన్. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసుకు భయపడి ప్రత్యేక హోదా అంశం వదిలి ప్రత్యేక ప్యాకేజీ కి మొగ్గు చూపినప్పటికీ వైఎస్ జగన్ మాత్రం తాను ఏర్పాటు చేసిన సమావేశాల్లో, పాదయాత్రలో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్థావిస్తూనే ఉన్నారన్నారు.
see also : సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు
see also : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ..హైదరాబాద్లోని ఓ మోస్ట్ సెలబ్రిటీ హత్యకు పక్క ప్లాన్
అలాగు, ఇటీవ జరిగిన పార్లమెంట్ సమావేశాల గురించి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు తీవ్ర నష్టం చేకూర్చిందన్నారు. నాడు అదే పార్లమెంట్ వేదికగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి… నేడు అదే పార్లమెంట్లో మాట దాటవేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి, దాని పార్టనర్ పార్టీ టీడీపీకి ప్రజలు బుద్ధిచెబుతారన్నారు.