సామాన్యుల జీవితాళ్లలోనే కాదు సెలెబ్రేటిస్ జీవితాల్లో కూడా కన్నీళ్లు ఉంటాయి అని సింగర్ కౌసల్య జీవితం గురించి తెలుసు కుంటే తెలుస్తుంది.సింగర్ గా మంచి ఫేమ్ లో ఉన్నప్పుడు తన పెళ్లి గురించి ఆలోచిస్తూ ఎన్నో ఆశలను పెట్టుకుంది. తనను అర్థం చేసుకుని, ప్రేమించే వ్యక్తి దొరికాడన్న ఆనందం కొద్దిసేపు కూడ ఉండలేదంట.
పెళ్లిలో మర్యాదలు సక్రమంగా చేయలేదనీ తన తల్లిని నిందిస్తుంటే తాను కల్పించుకుని తన తల్లిని ఏమీ అనవద్దని అన్నందుకే తన భర్త శోభనం రోజు మరుసటి రోజే కొట్టాడని ఆ సంఘటన ఇప్పటికీ బాధగా మిగిలిపోయిందని సినీ గాయని కౌసల్య చెప్పుకొచ్చింది.
తాజాగా ఆమె ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సింగర్ కౌసల్య ఎదుర్కొన్న గృహహింసను వివరించింది. పెళ్లిలో తమకు మర్యాదలు సరిగ్గా చేయలేదని గొడవకు దిగగా, తన తల్లిని ఏమీ అనవద్దని అన్నందుకే కొట్టాడని, ఆ దెబ్బ ప్రభావం ఏళ్లు గడిచినా తనపై ఇంకా ఉందని చెప్పింది. అప్పుడే చనిపోవాలని, విడాకులు తీసుకోవాలని అనుకున్నానని, అయితే, చిన్నతనంలోనే తండ్రి చనిపోగా, కష్టపడి పెంచిన తల్లి, పెళ్లి కావాల్సిన చెల్లెలు, సొసైటీ గురించిన ఆలోచన వచ్చి ఆగిపోయానని తెలిపింది.
ఆ తర్వాత బాబు పుట్టిన ఆరేళ్ల తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉందని, ‘సూపర్ సింగర్ 7’ జరుగుతున్న వేళ, సమస్యను పరిష్కరించేందుకు తన బావ వచ్చిన వేళ, వాళ్ల ముందు తనను రక్తం కారేలా కొట్టాడని, ఆ సమయంలో బాబు వచ్చి, “అమ్మను కొట్టొద్దు నాన్నా. ప్లీజ్ కొట్టొద్దు నాన్నా” అని వేడుకుంటుంటే హృదయం బాధతో ద్రవించిపోయిందని చెప్పింది. అంతేకాదు అతనికి ఇంకో అమ్మాయితో సంబంధముందని, వారికో బిడ్డ కూడా ఉన్నాడని తెలిసి తట్టుకోలేకపోయానని కౌసల్య వెల్లడించింది. ప్రస్తుతం నేను,నాబిడ్డ తో కలిసి హాయిగా జీవితం గడుపుతున్నాను అని చెప్పుకొచ్చింది.నా జీవితం లో జరిగిన ఘటన లు ఏఅమ్మాయి జీవితం లో జరగకూడదు అని దేవుడిని కోరుకున్నాను అని చెప్పింది.